సర్కార్ ఆస్పత్రికి తాళం.. పురిటినొప్పులతో ‘తల్లి’డిల్లె…

by  |

దిశ, నల్లగొండ: ప్రభుత్వాస్పత్రులను మెరుగుపర్చామని పాలకులు ఎంత చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. ఇందుకు ఉదాహరణే మఠంపల్లిలో జరిగిన ఘటన. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలకేంద్రంలోని సాగర్ సిమెంట్‌ కంపెనీలో పనిచేసే ఓ కార్మికుడి భార్య శాంతాదేవికి శనివారం ఉదయం పురిటినొప్పులు రాగా ఓ వాహనాన్ని కిరాయి తీసుకొని ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. కానీ, అక్కడకి వెళ్లేసరికి ఆస్పత్రి గేటుకు తాళం వేసి ఉండటంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గేటు వద్దే ఉండిపోయింది. సుమారు 2 గంటలు గేటు ముందే నొప్పులతో బాధపడి పండంటి మగబిడ్డకు జన్మిచ్చింది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న సిబ్బంది పీహెచ్‌సీ తల్లిబిడ్డను హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం దృష్టికి రాలేదని, విచారణ చేస్తానని డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ పేర్కొన్నారు.


Next Story