జగిత్యాలలో నేటి నుంచి లాక్ డౌన్

by  |
Lockdown
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి కట్టడికి ఇంజనీరింగ్ వ్యాపారులు శ్రీకారం చుట్టి, వ్యాపారులు సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా అడుగులు వేశారు. జిల్లా కేంద్రంలోని ఆటో స్టోర్స్, లైట్ మిషన్ వర్కర్స్ , టు వీలర్ మెకానిక్ దుకాణాలను మధ్యాహ్నం 3 గంటల వరకు, ఆటో స్టోర్ లైట్ మిషన్ దుకాణాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు మూసివేయాలని ఆ సంఘం అసోసియేషన్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

పట్టణంలోని ఇంజనీరింగ్ షాప్ అసోసియన్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. కరోనా కట్టడికి వినియోగదారులు అరికట్టేందుకు సహకరించాలని కోరారు. ఆదివారం నుండి ఈ విధానం కఠినంగా అమలు చేయాలని అసోసియేషన్లు నిర్ణయించుకున్నాయి.

Next Story