రేపటి నుంచి నెల్లూరులో లాక్‌డౌన్

by  |
రేపటి నుంచి నెల్లూరులో లాక్‌డౌన్
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఏరోజుకారోజు పాత రికార్డులు తుడిచిపెట్టేస్తూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్న కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జులై 24 నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ వారం రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసర వస్తువుల షాపులకు అనుమతి ఉంటుంది. మెడికల్ షాపులు, పాల బూత్‌లకు సాయంత్రం ఆరు వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. మరోవైపు జిల్లాలోని మేజర్ పంచాయతీలతో పాటు మున్సిపల్ కేంద్రాల్లో కూడా లాక్‌డౌన్ అమలవుతోంది.

Next Story

Most Viewed