Karnataka lockdown news: కర్నాటకలో లాక్‌డౌన్ పొడిగింపు

by  |
Karnataka lockdown news: కర్నాటకలో లాక్‌డౌన్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా కరోనా కట్టడి కోసం లాక్‌‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుల తీవ్రత తగ్గకపోవడంతో లాక్‌డౌన్ మరోసారి పొడిగిస్తున్నట్టు సీఎం యడియూరప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

లాక్‌డౌన్‌ను ఈనెల 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఏ రంగానికి కూడా ప్రభుత్వం సడలింపులు ఇవ్వలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. పవర్ లూమ్ కార్మికులకు, మత్స్యకారులకు, దేవాదాయ శాఖ అర్చకులకు, ఆశా వర్కర్లకు రూ. 3వేలు ఇస్తున్నట్టు సీఎం యడియూరప్ప వెల్లడించారు.


Next Story

Most Viewed