ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్..?

by  |
ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్..?
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నట్టు సమాచారం. ఈనెల 28,29,30 తేదీల్లో లాక్ డౌన్ విధించనున్నట్టు కేజ్రీవాల్ సర్కార్ యోచిస్తున్నది. మూడు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ సూచించింది. అయితే కరోనా కేసుల పెరుగుతున్న కారణంగా ప్రజలు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed