చౌటుప్పల్‌లో పశువుల దొంగలు అరెస్ట్

by  |
చౌటుప్పల్‌లో పశువుల దొంగలు అరెస్ట్
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డులో నలుగురు పశువుల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండీ.ఖలీల్(40), సల్మాన్ అలీఖాన్(22), ఎండీ అబిద్(23), ఎస్కే సొహైల్(22) అనే నలుగురు ముఠాగా ఏర్పడి పశువుల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందినవారు. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు నమోదైనట్లు చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య తెలిపారు. ఇప్పటి వరకు 26 గొర్రెలు, 19 మేకలను దొంగలించి ఇన్నోవా కారులో హైదరాబాద్ తరలించి మార్కెట్లలో తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.3,16,00, మూడు సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed