- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

పొద్దు పొడుపు వేళ
పక్షుల కిలకిల రావాలతో కాదు
బాంబుల మోతతో నిద్రలేస్తున్న జనం..
ఏ క్షణం ఏ బాంబు పడుతుందో?
ఏ శబ్దం చివరిదవుతుందో?
ఏ అడుగు తుదిదవుతుందో? తెలియక
కంటిమీద కునుకు లేక ప్రాణాలు
అరచేతిలో పెట్టుకుని నిరంతర
భయాందోళనతో బతుకీడుస్తూన్నారు.
ఇల్లు, బడి... ప్రాంతమేదైనా
భయం ఒక్కటే... అదే యుద్ధం...
ఎవరికోసమీ రణరంగం?
ఈ యుద్ధం సాధించినదేమిటి?
ఎందరో స్త్రీలకు కడుపుకోత...
శిధిలాల్లో తమవారిని వెతుక్కోవడమే కదా!
నాటి కురుక్షేత్రం నుంచి
నేటి ప్రపంచ యుద్ధాల దాకా
మిగిలింది కన్నీళ్లు, విషాదం..
సాధించినది శూన్యమే కదా!
ఎందుకు చనిపోతుందో
తెలియని పసికందు
ఏ దేశానికి శత్రువు?
ఏ యుద్ధానికి కారణం?
యావత్ ప్రపంచాన్ని
వణికించే ఈ యుద్ధం
ఎవరిని ఉద్ధరించడానికి?
రణ భూమి గుర్తులైనా
రక్తపుటేళ్లు, శవాల గుట్టలు...
ఇవి గెలుపు గుర్తులా?
మానవత్వపు ఓటమి చిహ్నాలా?
కదన రంగంలో గెలుపైనా, ఓటమైనా...
సాధించేది, చివరకు మిగిల్చేది శిధిలాలే.
-డాక్టర్ ఆవుల రేణుక
93982 68976
- Tags
- Poem






