- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, బాసర : రాజీవ్ గాంధీ సాంకేతిక విద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో 2021–22 విద్యా సంవత్సరానికి ప్రవేశాల జాబితాను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ సంవత్సరం పాలిసెట్ విధానం ద్వారా ప్రవేశం కోసం ఎంపికైన విద్యార్థుల మొదటి దశ ప్రవేశ జాబితాను కళాశాల ఏవో రాజేశ్వర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులకు మొత్తం 20,195 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇందులో స్థానిక విద్యార్థుల నుంచి 19,269 స్థానికేతర 221, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు 11,215, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారు 8275, ఇతర రాష్ట్రాలు, గ్లోబల్ సీట్ల కు 25 దరఖాస్తులు అందాయని తెలిపారు.
మొత్తం సీట్లలో 15% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, మిగిలిన 85% సీట్లు తెలంగాణకు చెందిన స్థానిక విద్యార్థులకు కేటాయించబడినవి. ఎంపికైన విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు అందరూ తప్పనిసరిగా కావలసిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు నిర్దేశించిన తేదీ నాడు హాజరుకావాలని, కౌన్సిలింగ్ కు హాజరు కాని విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం కోల్పోతారని అధికారులు తెలిపారు.