ఆ గ్రామంలో మద్యం అమ్మితే రూ.25,000 జరిమానా

by  |
ఆ గ్రామంలో మద్యం అమ్మితే రూ.25,000 జరిమానా
X

దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం అయ్యవారిగూడ గ్రామంలో బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మాణం చేసింది. గ్రామ సర్పంచ్ నెనావత్ గంగాబాయి అధ్యక్షతన జరిగిన ఈ సమవేశంలో అయ్యవారిగూడ, ఏనేకింది తండాల్లో నిత్యం జరుగుతున్న అల్లర్లు, ప్రజల ఆరోగ్యం, మహిళల ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే బెల్టు షాపు నిర్వాహకులపై రూ. 25,000 జరిమానా, లైసెన్స్ రద్దు చేస్తామని సర్పంచ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ నక్క మహేందర్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి హేమలత, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed