లైన్‌మెన్‌ను నిర్బంధించిన గ్రామస్తులు

by  |
లైన్‌మెన్‌ను నిర్బంధించిన గ్రామస్తులు
X

దిశ, మెదక్: నార్సింగ్ మండలం శేరిపల్లిలో గ్రామస్తులు విద్యుత్ లైన్‌మెన్‌ను బంధించారు. గ్రామంలో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై పలుమార్లు విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. దీంతో గ్రామానికి వచ్చిన లైన్ మెన్‌ను నిర్బంధించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో నూతన విద్యుత్ స్థంబాలు వేయాలని డిమాండ్ చేశారు.


Next Story