అక్కడ అన్నాచెల్లి పెళ్లి చేసుకుని పిల్లలను కంటున్న వైనం.. కారణమేంటంటే?

by Hamsa |
అక్కడ అన్నాచెల్లి పెళ్లి చేసుకుని పిల్లలను కంటున్న వైనం.. కారణమేంటంటే?
X

దిశ, ఫీచర్స్: భారతదేశంలోని ప్రజలు కుటుంబ బంధాలకు, బంధుత్వాలకు ఎంతో విలువను ఇస్తుంటారు. ఇక్కడ కొన్ని ఆచారాలు, సంప్రదాయాలను కూడా పాటిస్తారు. అలాగే సోదరి బంధం, భార్యాభర్తల బంధం మొదలైన వాటికి ప్రతీకగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. అయితే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నాచెల్లి పెళ్లి చేసుకుని పిల్లలను కంటారట.

అసలు విషయంలోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లో ధృవ అనే తెగకు చెందిన వారు నివసిస్తున్నారు. వారు గిరిజనులు కావడంతో బయట సమాజానికి వారి ఆచారాలు భిన్నంగా ఉంటాయట. అందుకే వారి ఆచారాలు, సంప్రదాయాలు సమాజానికి విచిత్రంగా ఉన్నప్పటికీ వారు గత కొద్ది కాలం నుంచి పాటిస్తూ వస్తున్నారట. అయితే ఇక్కడ తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలకు వివాహం చేసి భార్యాభార్తలను చేస్తారు. అంటే అన్నా చెల్లి పెళ్లి చేసుకుని దంపతులుగా జీవనం కొనసాగించాలన్న మాట. ఈ ఆచారం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతుంది.

కారణమేంటంటే.. ఒకవేళ ఎవరైనా అన్నాచెల్లి పెళ్లికి నిరాకరించినట్లయితే వారు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాలట. గిరిజనులకు డబ్బులు కట్టే పరిస్థితి లేక అందుకే తప్పకుండా అన్నాచెల్లి పెళ్లి చేసుకుని పిల్లలను కంటారట. ధృవ తెగలో జనాభా తక్కువగా ఉండటం వల్ల తమ స్వంత పిల్లలకు పెళ్లి చేసి జనాభా రేటును పెంచుకోవడానికి అలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే భారతీయులు బావ-మరదలు, మామ కోడలు, లేక ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ అన్నాచెల్లి పెళ్లి చేసుకోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.



Next Story

Most Viewed