గూగుల్‌కి షాకిచ్చిన 7 రాష్ట్రాలు.. రూ. 76 కోట్ల దావా!

by Dishanational4 |
గూగుల్‌కి షాకిచ్చిన 7 రాష్ట్రాలు.. రూ. 76 కోట్ల దావా!
X

దిశ, ఫీచర్స్: గూగుల్, ఐ హార్ట్ మీడియా(iHeartMedia) రెండూ 'మోసపూరిత' పిక్సెల్ 4 సిరీస్‌ ప్రకటనలను ప్రసారం చేసినందుకు దావాను ఎదుర్కొంటున్నాయి. 2019, 2020లో పిక్సెల్4 ఫోన్‌ల వినియోగాన్ని ప్రోత్సహించే రేడియో వ్యక్తులను కలిగి ఉన్న దాదాపు 29,000 తప్పుడు ప్రకటనలను ప్రసారం చేసినందుకు కంపెనీలపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC), ఏడు రాష్ట్రాలు దావా వేశాయి.

ఎఫ్‌టిసి ప్రకారం.. గూగుల్, ఐహార్ట్‌మీడియా పిక్సెల్4 సిరీస్ ఫ్లాగ్‌షిప్‌లను ప్రచారం చేయడానికి ఇన్‌ఫ్లుయెన్సర్‌లను నియమించుకంది. 'ఇది నాకు ఇష్టమైన ఫోన్ కెమెరా, ముఖ్యంగా ఈ ఫోన్ లో లైట్, నైట్ సైడ్ మోడ్‌కి చాలా కృతజ్ఞతలు. నేను స్టూడియోలో తీస్తున్న ఫొటోల మాదిరిగానే ఈ ఫోన్‌లో ఫొటోలు వస్తున్నాయి. ఒకేసారి అనేక టాస్క్‌లను హ్యాండిల్ చేయగల కొత్త వాయిస్ యాక్టివేటెడ్ గూగుల్ అసిస్టెంట్‌కు ధన్యవాదాలు' అని ప్రసారం చేసినట్లు ఎఫ్‌టిసి పేర్కొంది. అయితే ఐ హార్ట్‌ మీడియా సంస్థ ప్రకటనలను రికార్డ్ చేసి ప్రసారం చేయడానికి ముందు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎప్పుడు కూడా ఈ ఫోన్‌లను ఉపయోగించలేదని దావాలో పేర్కోంది.

అంతేకాకుండా గూగుల్.. పిక్సెల్4ని ఆమోదించే ఫేక్ ప్రకటనల కోసం ఐ హార్ట్ రేడియోకి సుమారు 2.6 మిలియన్లు, పదకొండు చిన్న రేడియో నెట్‌వర్క్‌లకు సంబంధించి 2 మిలియన్లకు పైగా చెల్లించిందని ఎఫ్‌టిసి ఆరోపించింది. ఇక ప్రతిపాదిత ఎఫ్‌టిసి ఆరోపణలను పరిష్కరించే రాష్ట్ర తీర్పులు భవిష్యత్తులో ఇలాంటి మోసపూరిత ప్రకటనల నుంచి గూగుల్, ఐ హార్ట్‌ మీడియాని నిరోధించాయి. అంతేకాకుండా ఈ కంపెనీలకు రూ. 76 కోట్ల జరిమానా విధించాలని డిమాండ్ చేసింది.

READ MORE

చరిత్రలో అదృశ్యమైన ఆ పది రోజులు.. ఎందుకు కోల్పోయామంటే..?


Next Story

Most Viewed