- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోజూ అర టీస్పూన్ పసుపు తీసుకుంటే ఆ సమస్యలు మాయం
దిశ, ఫీచర్స్ : పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం వండుకునే కూరల్లో ఇది చిటికెడు అయిన వేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక ఔషధంలా పని చేస్తుంది. పసుపును రెగ్యులర్గా తీసుకుంటే చాలా సమస్యలు దూరమవుతాయి. ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా చర్మ సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. ప్రతి రోజూ హెర్బల్ టీలో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా రోజూ అర స్పూన్ పసుపు తీసుకుంటే కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గుండె సమస్యలు..
పసుపులోని ప్రత్యేక లక్షణాలను గుండెకు మేలు చేసేదిగా వర్ణించవచ్చు. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ధమనులలో కొవ్వు పేరుకుపోదు. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.
క్యాన్సర్
పసుపులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇది సెల్ డ్యామేజ్ ను పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే కణితి ఏర్పడకుండా చేస్తుంది. పసుపును తక్కువ మొత్తంలో తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి
పసుపు తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి రోగనిరోధక శక్తిని పెంచడం. దీన్ని కషాయంలా చేసుకుని తాగితే రోగనిరోధక వ్యవస్థ బలపడి అనేక సమస్యలు దూరం అవుతాయి.
బరువు తగ్గడం..
పసుపులో ఉండే కర్కుమిన్ మన శరీరానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. అధిక బరువుతో బాధ పడే వారు పసుపును క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
- Tags
- Healthtips