శుక్రవారం అమ్మవారికి ఇది సమర్పిస్తే చాలు మీ ఇంట సిరుల పంటే!

by Disha Web Desk 9 |
శుక్రవారం అమ్మవారికి ఇది సమర్పిస్తే చాలు మీ ఇంట సిరుల పంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలామంది సంపాదిస్తున్న డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. ఎంత ఖర్చు తగ్గించుకున్నా ఏదో ఒక రూపంలో సంపద వృథా అవుతూనే ఉంటుంది. అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని భావించి కొందరు దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటోను కానీ, ప్రతిమను కానీ శుభ్రం చేసి గంధం, కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అలాగే మంచి పరిమళ భరితమైన పువ్వులను పూజ కోసం వాడుతుంటారు. లక్ష్మీదేవిని నమస్కారం చేసుకుంటూ.. మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ అమ్మవారికి ఆహ్వానం పలకాలి.

భక్తి శ్రద్ధలతో పూజ మొత్తం చేశాక.. చివరకు నైవేధ్యం సమర్పించాలి. అందులో అమ్మవారికి చాలా ఇష్టమైన చెరుకురసం ముందు పెట్టాలి. ఇలా చెరుకురసం ప్రతి శుక్కవారం లక్ష్మీదేవికి నైవేధ్యంగా పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. అనంతరం ఆ చెరుకురసాన్ని ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల మీ పిల్లల్లో చెడుగ్రహ దోషాలు తొలగిపోవడంతో పాటు, ఇంట్లో ఉన్న దరిద్ర్యం మొత్తం పోయి.. ప్రశాంతత ఉంటుంది. ఈ విధంగా చేసే వారి కుటుంబంలో ఎలాంటి డబ్బు లోటు అనేదే ఉండదు. ఎక్కువగా వ్యాపారాలు చేసేవారు ఇలా చేస్తే మాత్రం ఆ బిజినెస్‌లో ఉన్నత స్థాయిలో నిలుస్తారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహం పొందండి.

Also Read...

మీ ఇంట్లో దృష్ట శక్తి ఉందని అనుమానమా.. ఇలా తెలుసుకోండి


Next Story

Most Viewed