కొబ్బరి కాయలో నీళ్లు, కొబ్బరి ఎలా ఏర్పడుతుంది..? పరిశోధనల్లో తేలిన నమ్మలేని నిజాలు

by Dishaweb |
కొబ్బరి కాయలో నీళ్లు, కొబ్బరి ఎలా ఏర్పడుతుంది..? పరిశోధనల్లో తేలిన నమ్మలేని నిజాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎండకాలంలో కొబ్బరి బొండాం బండి ఎక్కడ కనబడితే అక్కడ ఆగిపోతుంటాం. ప్రకృతి ప్రసాదించే సహజపానీయం కొబ్బరి నీళ్లు. ఎండా కాలంలో కొబ్బరి నీళ్లు తాగితే రిఫ్రెషింగ్‌గా, కడుపు చల్లగా ఉంటుంది. ఈ కొబ్బరి నీళ్లు వలన డీహైడ్రేషన్‌, ఎండ వేడిని తగ్గడమే కాదు.. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అయితే చాలా మందికి కొబ్బరి బొండాంలో నీళ్లు ఎలా వస్తుందనే విషయం తెలియకపోవచ్చు.

ప్రపంచంలో ఎక్కువ నీరు ఉండే ఏకైక కాయ కొబ్బరి బొండాం. కొబ్బరిబొండాం లోపల నీరు ఉండే భాగాన్ని ఎండో స్పెర్మ్ భాగం అంటారు. కొబ్బరి చెట్టు తన బొండాలను నీటి నిల్వ కోసం ఉపయోగిస్తుంది. ఈ నీటిని మూల వ్యవస్థ ద్వారా సేకరించే చెట్టు బొండాల లోపలికి తరలిస్తుంది. బొండాం కణాల ద్వారా లోపలికి నీరు వెళ్తుంది. ఈ నీటిలోని ఎండోస్పెర్మ్ కరిగిపోతునప్పుడు, అది చిక్కగా తయారుతుంది. నీరు మొత్తం ఎండిపోయినప్పుడు... ఎండోస్పెర్మ్ ఘన స్థితిలో తెల్లటి రంగులోకి మారుతుంది. దీన్నే మనం కొబ్బరి అంటాం. కొబ్బరి నీరు అనేక పోషకాలకు మంచి మూలం. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు ధ్రువీకరించారు.

Read more : ఈ గింజలు రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

కొబ్బరినీళ్లు మితిమీరి తాగుతున్నారా?


Next Story

Most Viewed