50 ఏళ్లుగా మంచినీళ్లే తాగని తాత.. ఎలా బతికున్నాడో తెలుసా..

by Disha Web Desk 20 |
50 ఏళ్లుగా మంచినీళ్లే తాగని తాత.. ఎలా బతికున్నాడో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. మనిషి శరీరం ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు ఆరోగ్యంగా ఉండగలదు. కానీ నీరు లేకుండా 7 రోజులు మాత్రం జీవించడం చాలా కష్టం. అయితే ఓ వ్యక్తి మాత్రం నీరు లేకుండా 1 కాదు 2 కాదు ఏకంగా యాభై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. ఏది తిన్నా, దాహం వేసినా కోకాకోలా తాగుతూ గత 50 ఏళ్లుగా బతికే ఉన్నానని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఇంతకీ ఈ విచిత్ర కరమైన వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెజిల్‌లోని బహియాలో నివసిస్తున్న 70 ఏళ్ల రాబర్ట్ పెడ్రీరాను కోకా కోలాకు పెద్ద ఫ్యాన్. ఓ న్యూస్ వెబ్‌సైట్ ఇచ్చిన నివేదికల ప్రకారం ఆ వ్యక్తి గత 50 సంవత్సరాలుగా కోకాకోలా మాత్రమే తాగుతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంత కోక్ తాగుతున్న ఆ వ్యక్తికి డయాబెటిస్, గుండె జబ్బులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అతను కోకాకోలా తాగడం మాత్రం మానుకోవడం లేదంట.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి మందులను నీళ్లతో కాకుండా కోక్‌తో తీసుకుంటానని అక్కడి వైద్యులతో చెప్పాడట. ఇక్కడే అర్థం అవుతుంది అతనికి కోక్ అంటే ఎంత ఇష్టమో. ఇప్పటికే అతని గుండెలో 6 స్టెంట్లు ఉన్నాయట. అయినప్పటికీ ఈ సీతయ్య ఎవరి మాట వినకుండా కంటిన్యూగా కోక్ తాగుతూనే ఉంటున్నారట.

తన అభిరుచి గురించి ఆ వ్యక్తి మాట్లాడుతూ తనకు 70 ఏళ్లు నిండాయని, జీవితాన్ని బాగానే గడిపానని, ఇప్పుడు చనిపోయినా ఎవరికీ ఎలాంటి నష్టం రాదని చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వ్యక్తి ఐస్ క్రీమ్ తినే సమయంలో కూడా కోక్ తాగుతాడట. ఆ వ్యక్తి కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను అబద్ధం చెబుతున్నాడని చాలా మంది అనుకున్నారు. కాని రాబర్ట్ 27 ఏళ్ల మనవడు తన తాత నీరు తాగడం ఎప్పుడూ చూడలేదని చెప్పడంతో ప్రజలు దాన్ని నమ్మడం ప్రారంభించారట.



Next Story

Most Viewed