చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: అతిగా తింటే మోస్ట్ డేంజరస్ వ్యాధి.. WHO కీలక హెచ్చరిక!

by Disha Web Desk 9 |
చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: అతిగా తింటే మోస్ట్ డేంజరస్ వ్యాధి.. WHO కీలక హెచ్చరిక!
X

దిశ, వెబ్‌డెస్క్: చికెన్ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్‌ను లొట్టలేసుకుంటూ లాగిస్తారు. కొంతమందికి రోజూ ముక్క ఉంటే కానీ ముద్ద దిగదు. అయితే తాజాగా చికెన్ అతిగా తినేవారికి WHO షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత రోజుల్లో చికెన్‌ను ఆరోగ్యంగా, తాజాగా ఉంచడానికి యాంటీబయాటిక్స్‌ పౌల్ట్రీలలో ఇస్తున్నారు. దీని కారణంగా కోడి శరీరంలో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్ పేరుకుపోతుంది. దీంతో చికెన్ తినేవారి శరీరంలో చేరి అనారోగ్యానికి గురవుతున్నారు. చికెన్ తిన్న తర్వాత శరీరంలోకి చేరే యాంటీబయోటిక్స్ కొంతసేపటికి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌గా మారుతాయి. అలాంటి టైమ్‌లో మన బాడీ ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే చాన్సెస్ ఉంటాయి. ఈ రకమైన ఇన్ఫెక్షన్‌కు ట్రిట్‌మెంట్ కూడా కష్టమని పరిశోధకులు వెల్లడించారు. అన్నింటికి మించి ఈ చికెన్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద వ్యాధికి మిమ్మల్ని బలిపశువును చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరించింది.

ఏఏంఆర్ వ్యాధి అనేది ప్రపంచంలో పదవ అతిపెద్ద వ్యాధిగా జాబితాలోకి ఎక్కింది. ఈ సమస్య బారిన పడినవారు, ఈ వ్యాధి దరి చేరకుండా ఉండాలనుకునేవాళ్లు.. మీ భోజనంలో శరీరానికి అధికంగా ప్రోటీన్లు అందించే శాఖాహారాన్ని (కూరగాయలు, పనీర్, పాలు, పెరుగు) తీసుకోవడం మేలని లేకపోతే అత్యంత వేగంగా యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏంఎంఆర్) బాధితులుగా మారుతారని ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఎం.వలి హెచ్చరించారు.

Also Read..

చపాతీలు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి..?


Next Story

Most Viewed