మామిడి పండు గుజ్జుతో అందాన్ని రెట్టింపు చేసుకోండి!!

by Disha Web Desk 6 |
మామిడి పండు గుజ్జుతో అందాన్ని రెట్టింపు చేసుకోండి!!
X

దిశ, వెబ్ డెస్క్: వేసవిలో మార్కెట్‌లో విరివిగా దొరికే మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ,సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని కాలుష్యం సూర్య రష్మీ నుండి కాపాడుతాయి. కాబట్టి మామిడి గుజ్జుతో ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. మెటిమలు, నల్లటి వలయాలు, కళ్ల కింద వాపులు ఉన్నవారు మామిడి పండు గుజ్జును ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. వృద్ధాప్య ఛాయలు, ముడతలు, మచ్చలు రాకుండా మామిడి గుజ్జు కాపాడుతుంది. ఈ గుజ్జును రోజూ ఫేస్‌పై అప్లై చేయడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా మారి మిల మిల మెరిసిపోతారు.

Read more:

ఉగాది పండుగ వచ్చేసింది.. తిథి, ముహుర్తానికి సంబంధించిన పూర్తి వివరాలివే.


Next Story

Most Viewed