- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
BCCI Pahalgam Terror Attack: IPLకు కశ్మీర్ ఎఫెక్ట్ .. ఉగ్రదాడుల వేళ బీసీసీఐ సంచలన నిర్ణయం..!

దిశ, వెబ్ డెస్క్:BCCI Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, 17 మంది గాయపడ్డారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించడానికి BCCI నాలుగు ప్రధాన చర్యలు తీసుకుంది. IPL 2025లో ఏప్రిల్ 23న జరగనున్న మ్యాచ్లో ఆటగాళ్లు, అంపైర్లు చేతులకు నల్లటి బ్యాండ్లు ధరించి మైదానంలోకి ప్రవేశించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు నిర్ణయించింది.
సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ళు ఒక నిమిషం మౌనం పాటించి, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తారు. దీనితో పాటు, రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో పటాకులు కాల్చడం కూడా నిషేధించింది. అయితే IPL 2025 41వ మ్యాచ్లో చీర్లీడర్లు కూడా డ్యాన్స్ చేయడం కనిపించదు.
🚨 NO FIREWORKS, CHEERLEADERS. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2025
- Players of MI and SRH and umpires will be wearing black armbands tonight.
- A one minute silence will be observed.
- No fireworks, cheerleaders tonight. (Vipul Kashyap/ANI). pic.twitter.com/Ra0m7l92ir
కాగా జమ్మూ కాశ్మీర్ లో 56 మంది విదేశీ టెర్రరిస్టులు ఉన్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తోయిబా ముఠా సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నాయి. భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడవుతుంది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందినవారని వారిని బట్టి తెలుస్తోంది.
ముగ్గురికి ముజాహిద్దీన్ తో సంబంధం ఉందని..వారు కూడా పాకిస్తాన్ కు చెందినవారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఇక 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని..విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే ఆ సంఖ్య తక్కువగా ఉంది. ఈ విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోందన్నారు.