హృదయంతో ధనవంతుడైన తోపుడు బండి వ్యాపారి

by Disha Web Desk 2 |
హృదయంతో ధనవంతుడైన తోపుడు బండి వ్యాపారి
X

దిశ, డైనమిక్ బ్యూరో: డబ్బుతో ధనవంతుడు కావడం సాధారణ విషయమని, హృదయంతో ధనవంతుడు కావడం పెద్ద విషయమని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చెబుతోంది. రోడ్ల వెంట ఉండే మూగ జీవాలు ఆహారం కోసం చేసే వెతుకులాట మనం చూసే ఉంటాం. కానీ ఈ వీడియో పశువుల పట్ల మానవత్వం చాటుకున్న ఓ వ్యక్తిని మనస్తత్వాన్ని చేపుతోంది. తాను ఆపిల్ కాయలు అమ్మే వ్యక్తి అయినా ఎద్దు ఆకలి తీర్చారు. తనకు నష్టం వస్తుందని తెలిసినా చూస్తూ ఉండిపోయారు. పశువుల పట్ల ప్రేమ చూపించిన ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. పశువులు అంతరించి పోతున్న ఈ రోజుల్లో ఎద్దు ఆకలి తీర్చిన మహానుబావుడు అని కొందరు అధికారులు ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పశువుల పట్ల ప్రేమను చూపించాలని ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

Also Read..

ఈయన్ను అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే ఎవరైనా నమ్ముతారా?



Next Story

Most Viewed