- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విహారాల విడిదిగా.. అందమైన మాంగోస్టీన్ తోట
కేరళ రైతులంతా సాంప్రదాయ పంటలపైనే ఆధారపడేవారు. కానీ అతను మలేషియా నుంచి తెచ్చిన మాంగోస్టీన్ గింజలతో ప్రయోగం చేశాడు.

దిశ, ఫీచర్స్ : సాంప్రదాయ పంటలకు ప్రసిద్ధి చెందిన కేరళలో ఒక రైతు మాంగోస్టీన్ పండించాలనుకున్నాడు. అప్పుడది అందరికీ విచిత్రంగా అనిపించింది. ఆశ్చర్యపోయారు కూడా. ఆ తోటే ఇప్పుడు వందలాది టూరిస్టులను ఆకర్షించే అగ్రి టూరిజం కేంద్రంగా మారింది. అంతేకాదు.. సంవత్సరానికి రూ.90 లక్షల నుంచి 1.2 కోట్ల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు.
100 ఏళ్లనాటి చెట్లు
మెర్లిన్ మాంగోస్టీన్ ఫార్మ్ను స్థాపించినప్పుడు కేరళ రైతులంతా అడిక.. నారికేల.. జాయిక వంటి సాంప్రదాయ పంటలపైనే ఆధారపడేవారు. కానీ అతను మలేషియా నుంచి తెచ్చిన మాంగోస్టీన్ గింజలతో ప్రయోగం చేశాడు. ఇతర రైతులు పిచ్చోడు అన్నారు. ఈ పండుతో ఏం చేస్తావని అడిగారు. తాతకాలం నుంచి ఉన్న 100 ఏళ్ల పాత మాంగోస్టీన్ చెట్టు నుంచి గింజలు తీసి మొక్కలు నాటడమేంటి అన్నారు. అవేవీ పట్టించుకోకుండా మెర్లిన్ 40 మొక్కలు నాటాడు. ఆరంభంలో పొరుగు వారికి ఉచితంగా పండ్లు ఇచ్చేవారు. స్థానికంగా డిమాండ్ పెరగడంతో కేజీకి రూ.60కి అమ్మకాలు మొదలయ్యాయి.
సోషల్ మీడియా ద్వారా..
మెర్లిన్ కొడుకు మను మెర్లిన్ బి.కామ్ పూర్తి చేసి ఫిట్నెస్ ట్రైనర్గా జిమ్ నడుపుతున్నాడు. అతని సోదరుడు ఎంఎన్సీలో అకౌంటెంట్గా పని చేసి కుటుంబ వ్యాపారమైన అగ్రిబిజినెస్లోకి అడుగుపెట్టాడు. ఇద్దరూ కలిసి మార్కెటింగ్.. లాజిస్టిక్స్.. నర్సరీ నిర్వహణ చేస్తున్నారు. ప్రస్తుతం 5 ఎకరాల ఫార్మ్లో 800 చెట్లు ఉన్నాయి. సంవత్సరానికి 30 టన్నుల మాంగోస్టీన్ ఉత్పత్తి అవుతోంది. ఈ సీజన్లో 50,000కి పైగా మొక్కలు అమ్ముతారు. సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ ప్రీ ఆర్డర్లు వస్తున్నాయి. ఈ చెట్లకు లోతైన వేర్లు కలిగి ఉండటం వల్ల 2018 కేరళ వరదల్లో కూడా ఎలాంటి నష్టం లేకుండా బతికాయి.
టూరిజం హాట్స్పాట్గా..
అథిరప్పిళ్లి వాటర్ఫాల్స్ సమీపంలో ఉన్న ఈ తోట మాన్సూన్ టూరిజం సీజన్లో రద్దీగా ఉంటున్నది. వారాంతాల్లో 300 నుంచి 500 మంది వరకు ప్రత్యక్షంగా వచ్చి తాజా పండ్లు కొంటున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే పర్యాటకుల కోసం సమీప హోమ్స్టేలతో కూడా టై అప్ చేశారు. అలా ఈ తోట ప్రధాన ఆకర్షణగా నిలిచి, అగ్రి టూరిజం హాట్స్పాట్గా మారింది. ఒక సాధారణ రైతు కుటుంబం ధైర్యంగా కొత్త ప్రయోగం చేసి కష్టపడి.. సోషల్ మీడియా సాయంతో ఇంత పెద్ద విజయం సాధించడం నిజంగా స్ఫూర్తిదాయకం. సాహసం ఉంటే.. కష్టపడితే ఏ పంటైనా.. ఏ వ్యాపారమైనా విజయవంతం చేసుకోవచ్చు.






