- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వేరే లెవెల్.. కనీవినీ ఎరుగని రేంజ్లో అంబానీ భార్య బర్త్ డే వేడుకలు!
దిశ, వెబ్డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచంలోని అత్యంత సంపనున్నులైన టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే.. అత్యంత రిచ్ పర్సన్ అయిన అంబానీ ఇంట శుభకార్యం అంటే మామూలుగా ఉండదు. అదే లెవెల్లో అంబానీ సతీమణి నీతా అంబానీ 50వ పుట్టినరోజు వేడుకలు నవంబర్ 1, 2013లో రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగాయి. జోధ్పూర్లోని విలాసవంతమైన ఉమాయిద్ భవన్ ప్యాలస్లో రెండ్రోజుల పాటు గ్రాండ్గా ఈ వేడుకలు జరిగాయి. అయితే, ఈ వేడుకలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
దాదాపు 9 ఏళ్ల క్రితం జరిగిన ఆ పార్టీ కోసం ఏకంగా రూ.220 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. అతిథుల కోసం 32 చార్టెడ్ విమానాలను వినియోగించినట్లు తెలుస్తోంది. 250 మంది అతిథుల్లో బిజినెస్ కుటుంబాలు, సెలబ్రిటీలు ఉన్నారు. మిట్టల్స్, మహింద్రాస్, బిర్లాస్, గోద్రెజెస్, షారుక్ ఖాన్, అమిర్ ఖాన్, కరిస్మా కపూర్, రాణీ ముఖర్జీలతో పాటు ముంబాయి ఇండియన్స్ ఐపీఎల్ టీమ్ మొత్తం హాజరైంది. రెండు రోజుల వేడుకల్లో ప్రియాంక చోప్రా, ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు చేశారు. అలాగే నీతా అంబానీ కూతురు ఇషా అంబానీ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ధీరుబాయి అంబానీ చిత్రాన్ని లైట్ల ద్వారా ప్రదర్శించేందుకు సింగపూర్ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది.
ఇవి కూడా చదవండి:
బంగారం ఊరికే అలా పడి ఉందా? అయితే దాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందండి!