స్మార్ట్‌ఫోన్ తయారీకి ఎల్‌జీ గుడ్‌బై

by  |
స్మార్ట్‌ఫోన్ తయారీకి ఎల్‌జీ గుడ్‌బై
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ తన మొబైల్‌ఫోన్ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది. గత కొన్నేళ్లుగా భారీ నష్టాలు ఎదురవుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2013 సమయంలో దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ తర్వాత మూడో స్థానంలో అతిపెద్ద మొబైల్‌ఫోన్ తయారీ సంస్థగా ఎల్జీ నిలిచింది. కానీ, ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విపరీతమైన పోటీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమస్యలతో పాటు అప్‌డేట్‌లను అందించడంలో ఎల్జీ వెనకబడింది.

అదే సమయంలో చైనా కంపెనీలు మార్కెట్లో దూకుడు పెంచడంతో ఎల్‌జీ మనుగడకు ప్రమాదం ఏర్పడింది. సుమారు 6 ఏళ్లలో సుమారు రూ. 32,850 కోట్ల తీవ్రమైన నష్టాలను చూసిన ఎల్జీ.. తన వ్యాపారాన్ని వోక్స్‌వాహన్ ఏజీ, విన్‌గ్రూప్ జేఎస్‌సీ లాంటి బడా కంపెనీలకు విక్రయించాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలన్ని విఫలమవడంతో మొబైల్‌ఫోన్ తయారీ విభాగాన్ని మూసేయాలని నిర్ణయించింది. దీంతో స్మార్ట్‌ఫొన్ తయారీ నుంచి వైదొలగనున్న మొట్టమొదటి అతిపెద్ద కంపెనీగా ఎల్‌జీ నిలిచింది.

Next Story