‘ఎరువుల కొరత రానివ్వం’

by  |
‘ఎరువుల కొరత రానివ్వం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం పంటల సాగుకు ఎరువుల కొరత రానివ్వమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ వానాకాలం సాగుకు 25.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయింపు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులన్నాయని వివరాలు తెలిపారు. 3.73 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత వానాకాలం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మార్క్ ఫెడ్ వద్ద ప్రస్తుతం ఉన్న బఫర్ స్టాక్ నిల్వలను జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు తరలించి నిల్వ సామర్ద్యం పెంచుకోవాలి .. ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ తగ్గకుండా చూసుకోవాలని సూచించారు.

కొత్తగా నిర్మించిన వేర్ హౌసింగ్ గోడౌన్లు 15 రోజులలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వరంగల్, ఖమ్మం, వనపర్తిలలో కొత్త గోడౌన్లను ఎరువుల నిల్వకు వినియోగించుకోవాలని సూచించారు. సీజన్ ముందే ప్రారంభమయ్యే ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్ వంటి జిల్లాలకు ఎరువులను ముందే తరలించాలన్నారు. వ్యవసాయ శాఖ, మార్క్ ఫెడ్ ఉద్యోగులకు కరోనా టీకా వేయించేందుకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వానాకాలం ఎరువుల సరఫరా, నిల్వ గురించి సమీక్ష వ్యవసాయ, రైల్వే, ఎరువుల కంపెనీలు, మార్క్ ఫెడ్ అధికారులతో జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు..



Next Story