ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి లీగల్​ నోటీసు

by  |
mla sudheer reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవ‌హారాల ఇన్‌ఛార్జ్‌ ఠాగూర్ లీగ‌ల్ నోటీసు పంపారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామ‌కానికి రూ.25 కోట్లు వ‌సూలు చేశార‌ని జూలై 3న సుధీర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయని సుధీర్‌రెడ్డిని ఠాగూర్‌ నోటీసులో ప్రశ్నించారు. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేశారని, సుధీర్‌రెడ్డి ఆరోపణలతో మాణిక్క ఠాగూర్​ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని ఠాగూర్​తరుపున న్యాయవాది రవీంద్రన్‌ నోటీసులో పేర్కొన్నారు. రాతపూర్వకంగా వారంరోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రూ. కోటికి ప‌రువు న‌ష్టం దావా వేస్తామ‌ని ఠాగూర్‌ తరపు లాయర్‌ తెలిపారు.



Next Story

Most Viewed