వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలి..

by Shyam |

<p>దిశ, దుబ్బాక: వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలో చేరిన పలువురిని కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా టీఆర్ఎస్ నేటి వరకు పూర్తి చేయలేకపోయిందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా వాటికి రాష్ట్రప్రభుత్వం రంగులు [&hellip;]</p>

వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలి..
X

దిశ, దుబ్బాక: వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలో చేరిన పలువురిని కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా టీఆర్ఎస్ నేటి వరకు పూర్తి చేయలేకపోయిందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా వాటికి రాష్ట్రప్రభుత్వం రంగులు వేసి తామే ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మే ప్రసక్తే లేదన్నారు.

Next Story