- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చర్లలో మావోలకు వ్యతిరేకంగా కరపత్రాలు…..
<p>దిశ, భద్రాచలం : బంద్ రోజు మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయి. ఈ విషయం ఇప్పుడు భద్రాద్రి ఏజెన్సీలో చర్చనీయాంశమైంది. ఈనెలలో తెలంగాణలో వరుసగా జరిగిన నాలుగు ఎనకౌంటర్లు బూటకమేనని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. వాటికి నిరసనగా ఈ నెల 28 సోమవారం రాష్ట్ర బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈనెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ఈ నెల6న బంద్కు పిలుపునిచ్చింది. కాగా […]</p>

దిశ, భద్రాచలం : బంద్ రోజు మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయి. ఈ విషయం ఇప్పుడు భద్రాద్రి ఏజెన్సీలో చర్చనీయాంశమైంది. ఈనెలలో తెలంగాణలో వరుసగా జరిగిన నాలుగు ఎనకౌంటర్లు బూటకమేనని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. వాటికి నిరసనగా ఈ నెల 28 సోమవారం రాష్ట్ర బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈనెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ఈ నెల6న బంద్కు పిలుపునిచ్చింది. కాగా ఆరోజు బంద్ ప్రశాంతంగా జరిగిందని అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఇంతలోనే ఊహించని విధంగా మావోయిస్టులు ఆ రాత్రి చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో శక్తివంతమైన మందుపాతర పేల్చి రోడ్డును ధ్వంసం చేశారు. ఆ ఘటన నేపథ్యంలో బంద్ సందర్భంగా ఈసారి కూడా మావోయిస్టులు ఏదైనా అలజడి సృష్టించవచ్చని అందరూ టెన్షన్ తో ఉన్నారు. అలాంటి సమయంలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పలుచోట్ల ఈ తరహా కరపత్రాలు వెలుగు చూడటంతో ప్రజల దృష్టి అటువైపు మరలింది. ఆదివాసీల ఉసురు తీస్తున్నది ఎవరు అనే హెడ్డింగుతో ఉన్న కరపత్రాల్లోని అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ఇవి వేసింది ఎవరు అనేది కరపత్రాల్లో లేక పోవడం గమనార్హం.






