- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: తెలుగులో ‘ఆది’, ‘దిల్’, ‘ఒక్కడు’, ‘ఖుషి’, ‘గుడుంబా శంకర్’ లాంటి సినిమాలలో నటించి మెప్పించిన దివంగత దక్షణాది నటుడు రాజన్ పి.దేవ్ కుమారుడు ఉన్ని రాజన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను హింసించి, ఆత్మహత్యకు ఉసిగొల్పిన ఆరోపణల కింద ఉన్నిని నెడుమంగడ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. 2019లో ప్రియాంక అనే యువతిని ఉన్ని రాజన్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొద్దిరోజులు హాయిగా ఉన్నా ఆ తరువాత ఈ జంట మధ్య విబేధాలు మొదలయ్యాయి. తమ అల్లుడు భార్యను నిత్యం వేధిస్తూ, అదనపు కట్నం కోసం హింసించేవాడని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే మే 11 న ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అల్లుడే తమ కూతురి మరణానికి కారణమని ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన పోలీసులు ఉన్ని రాజన్ ని అరెస్ట్ చేశారు. కాగా, ఉన్నిరాజన్ కూడా నటుడే. కమెడియన్గా, విలన్గా దాదాపు ముప్ఫైదాకా మలయాళ చిత్రాల్లో నటించాడు.