ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు

by  |
ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య చాలా అవసరమని అన్నారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పతనమని ఆయన అన్నారు. అంతేగాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి, దేశంలో ఏ నాయకుడు చేయలేని పనులు సీఎం కేసీఆర్‌ చేశాడని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు. వ్యవసాయాన్ని కార్పోరేట్‌ చేతుల్లో పెట్టడానికే కేంద్రం ప్రయత్నం చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. రైతులు లేకపోతే దేశమే లేదని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed