నూతన సీఐని కలిసిన బహుజన సంఘాల నాయకులు

by  |
నూతన సీఐని కలిసిన బహుజన సంఘాల నాయకులు
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్.శ్రీనివాసరావును బహుజన సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నూతన సీఐకి పూలబుకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… మండలంలో కొంతమంది యువత మద్యం-మత్తు పదార్దాలకు అలవాటు పడుతున్నారని, చేడు మార్గం నుంచి మంచి మార్గానికి వచ్చేలా కృషి చేయాలని వారు కోరారు. మండలంలో జరిగే కొన్ని నేరాలను అదుపు చేయాలని మనవి చేశారు.

ఈకార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు మాదిగ జేఏసీ రాష్ట్రప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు, ముస్లిం మైనారిటీల సంక్షేమసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ యాకుబ్ అలీ,
ఎమ్మార్పీఎస్ జిల్లా నాయుకులు ఇసంపల్లి కృష్ణ,తెరాస మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గద్దల రామకృష్ణ,మాలమహానాడు జిల్లా సహాయ కార్యదర్శి మేకల భాస్కర్,కన్నెబొయిన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed