- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలంలోని భీంపల్లి, మాదన్నపేట గ్రామాలలో గురువారం ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ పర్యటించారు. వారికి మాదన్నపేట గ్రామంలోని దళితులు మంగళ హారతులతో, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని దళితుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళితులు ఆర్థికంగా బలోపేతం మరియు ఎదగడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల ఇన్చార్జి పేరియాల రవీందర్రావు, తక్కలపెల్లి సత్యనారాయణ రావు, ప్రదీప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- kamalapuram