- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఎల్బీనగర్: తప్పిపోయిన బాలుడిని చేరదీసిన ఎల్బీనగర్ పోలీసులు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మంగళవారం కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన ఏడేళ్ల బాలుడు నిత్యానాథ్ తల్లిదండ్రులు ఎల్బీనగర్ శ్రీనివాస నగర్ కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అయితే నిత్యానాథ్ ఆడుకుంటూ జనప్రియ కాలనీ రాక్ టౌన్ వరకు వచ్చాడు. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఉండడంతో పోలీసుల కంటపడ్డాడు. వెంటనే పోలీసులు అతన్ని చేరదీశారు. ఆచూకీ చెప్పలేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అనంతరం ఎస్ఐ సైదులు, కానిస్టేబుల్ బాలాజీ బాలుడి బంధువులు శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి నిత్యనాథ్ ను తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్ఐ సైదులు, కానిస్టేబుల్ బాలాజీలను ఎల్బీనగర్ సీఐ అశోక్ రెడ్డి అభినందించారు.