బాత్రూంలో యోగ టీచర్.. హాల్లో లాయర్.. పోలీసుల రాకతో..

by  |
బాత్రూంలో యోగ టీచర్.. హాల్లో లాయర్.. పోలీసుల రాకతో..
X

దిశ, వెబ్ డెస్క్: అతనో లాయర్.. కొన్నేళ్లుగా భార్యతో విడిపోయి కూతురితో నివాసముంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న అతని జీవితంలోకి ఒక యోగా టీచర్ వచ్చింది. ఆమె కూడా ఒంటరి మహిళ కావడంతో ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే కొద్దీ రోజుల తర్వాత వీరి ప్రేమ మధ్య విబేధాలు నెలకొన్నాయి. దీంతో మహిళ, లాయర్ ని వదిలేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. అది తెలుసుకున్న లాయర్ ఆమెను ఇంటికి పిలిచి హత్య చేసి, తన ఇంటి బాత్ రూమ్ లో పూడ్చిపెట్టాడు. ప్రేమించిన మహిళని చంపేశానన్న బాధతో తానూ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

మ‌ధురైకి చెందిన హ‌రికృష్ణ‌న్(40)లాయర్ గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితమే భార్యను వదిలి కూతురుతో ఉంటున్నాడు. కొన్నిరోజుల క్రితం హరికృష్ణన్ కి చిత్రాదేవి అనే యోగా టీచర్ పరిచయమయ్యింది. ఆమె కూడా భర్తను వదిలి ఉంటుండడంతో వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అయితే ఏప్రిల్ 2 నుండి చిత్రాదేవి కనిపించడం లేదని ఆమె తండ్రి కన్నయ్య, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా హరికృష్ణన్, చిత్రాదేవి ల విషయం బయటపడింది. దీంతో విచారణ నిమిత్తం మంగళవారం హరికృష్ణన్ ఇంటికి వెళ్లిన పోలీసులకు షాక్ తగిలింది. అప్పటికే అతను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ లో తానే చిత్రాదేవిని చంపి, బాత్ రూమ్ లో పూడ్చిపెట్టానని, ఆ తప్పు తనను వెంటాడుతోందని అందుకే తానూ కూడా తనువు చాలిస్తున్నట్లు నోట్ లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చిత్రాదేవి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed