లావణ్య గ్రీన్ ఇండియా చాలెంజ్

by  |
లావణ్య గ్రీన్ ఇండియా చాలెంజ్
X

లాక్‌డౌన్ మొత్తం హైదరాబాద్‌లోనే గడిపిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. ఈ మధ్యే హోమ్ టౌన్ డెహ్రాడూన్ చేరుకుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న లావణ్య.. డైరెక్టర్ నందు రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించింది. సహస్రధార లేక్‌లో సోదరుడితో కలిసి మొక్కలు నాటిన ఆమె.. ఇందులో చాలా మంది భాగస్వాములయ్యారని తెలిపింది. దాదాపు 50 మొక్కలు నాటిన లావణ్య.. రితు వర్మ, కార్తికేయ, వెన్నెల కిషోర్, సైనా నెహ్వాల్, అనిత రెడ్డిలను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసింది.

https://www.instagram.com/p/CERbG8-nwLg/?igshid=2l2p6b4w4qsy

తనను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేసిన నందు రెడ్డితో పాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది.


Next Story