క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. పక్క రాష్ట్రాల పరిస్థితిపై సర్కార్ ఆరా!

by Disha Web Desk 2 |
క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. పక్క రాష్ట్రాల పరిస్థితిపై సర్కార్ ఆరా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసులు వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లోని పరిస్థితిపై ఆరా తీసింది. సోమవారం వైద్యశాఖతో సమీక్ష నిర్వహించింది. కొవిడ్ తీవ్రత లేదని, ఎలాంటి టెన్షన్​లేదని వైద్యశాఖ ప్రభుత్వానికి వివరించింది. ఇక ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టెస్టింగ్, కంటైన్​మెంట్‌లపై ఫోకస్​పెట్టాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పాజిటివిటీ పెరుగుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ముఖ్యంగా అర్బన్​ఏరియాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇకవారం రోజుల తర్వాత కేసులు తీరును పరిశీలించి ఏప్రిల్ 11,12న అన్ని ఆసుపత్రుల్లో మాక్​డ్రిల్​నిర్వహించాలని సర్కార్​ఆలోచిస్తున్నది. కరోనా వార్డులు, బెడ్లు, స్టాఫ్, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యాలు వంటి వాటిపై ముందస్తు చర్యల్లో భాగంగా పరిశీలించనున్నారు. ఇప్పటికిప్పుడు మన స్టేట్‌పై కరోనా ప్రభావం ఉండే ఛాన్స్​లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.


Next Story

Most Viewed