- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
8న హైదరాబాద్కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాన నరేంద్ర మోదీ 8న హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూలు ఖరారైంది. 8న ఉదయం 11.30 గంటలకు మోదీ ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లనున్నారు.
అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. 12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొని 1.30 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
Read more:
Next Story