శ్రీవారి భక్తులకు శుభవార్త

by Disha Web Desk 1 |
శ్రీవారి భక్తులకు శుభవార్త
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. నేడు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. శ్రీవారిని దర్శించుకునే వారు రూ.300ల టిక్కెట్లు ఆన్‌లైన్ లో కొనుగోలు చేసి తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఏప్రిల్ నెల కోటాకు సంబంధించిన టిక్కెట్లను ఈ రోజు ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు టిక్కెట్లను ఆన్ లైన్ లో పెట్టనున్నారు. ఆన్‌లైన్ లో టిక్కెట్లు కొనుగోలు చేసే భక్తులు ఉదయం 11గంటలకు టీటీడీ వెబ్‌సైట్ లోకి వెళ్లి టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నెల టిక్కెట్లు కావడంతో శ్రీవారి టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోనున్నాయి.

Next Story

Most Viewed