రెండు రూపాయల్లో హైదారాబాద్ నుంచి విజయవాడ వెళ్లిరండి... ఆఫర్ ఆ ఒక్కరోజే..!

by Disha Web Desk 1 |
రెండు రూపాయల్లో హైదారాబాద్ నుంచి విజయవాడ వెళ్లిరండి... ఆఫర్ ఆ ఒక్కరోజే..!
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు రూపాలయలకు కిలో బియ్యం లాగా రెండు రూపాలయకే ప్రయాణం ఏంటండి అనుకునేరు. మీరు విన్నది నిజమేనండీ బాబు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూగో ట్రాన్స్ పోర్టేషన్ సంస్థ ఎలక్ట్రిక్ కంపెనీ వారు రూపాయికే ఏసీ కోచ్ లో ప్రయాణం చేసేందుకు తమ ఆఫర్ ను ప్రకటించారు. ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆ సంస్థ సీఈవో ఎండీ దేవేంద్ర చావ్లా ప్రకటించారు.

అదేవిధంగా ఇండోర్ నుంచి భోపాల్, ఢిల్లీ నుంచి చండీగఢ్, ఢిల్లీ నుంచి ఆగ్రా, ఢిల్లీ నుంచి జైపూర్, ఆగ్రా నుంచి జైపూర్, బెంగళూరు నుంచి తిరుపతి, చెన్నై నుంచి తిరుపతి, చెన్నై నుంచి పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగనున్నట్లు తెలిపారు. అయితే, పర్యావరణాన్ని కాపాడేందుకు గాను ప్రజలను ప్రోత్సహించడంతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా దూర ప్రయాణాలు చేసేందుకు వీలుంటుందని తెలిపేందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. https://nuego.in/booking వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed