చిన్నారితో రాత్రంతా గుడిలోనే..

by  |
చిన్నారితో రాత్రంతా గుడిలోనే..
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల తన భర్త, మరిది అమానుషంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని వాల్మీకిపురం మండలం ఓబులంపల్లిలో ఓ దంపతులిద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి మనస్పర్థలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన భర్త, మరిది ఆ మహిళను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ మహిళ తన చిన్నారితోనే రాత్రంతా గుడిలోనే గడపాల్సి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకుంటోంది. చూడాలి మరీ, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆ మహిళకు న్యాయం చేస్తారా లేదా అనేది.

Next Story

Most Viewed