- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సర్కారుపై మరోసారి హైకోర్టు సీరియస్
<p>దిశ, వెబ్ డెస్క్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి మండిపడింది. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడంలేదంటూ సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా కూడా నిమ్మగడ్డను ఎస్ఈవోగా ఎందుకు నియమించడంలేదంటూ మండిపడింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా గవర్నర్ విశ్వభూషణ్ ను కలిసి వినతి పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి మండిపడింది. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడంలేదంటూ సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా కూడా నిమ్మగడ్డను ఎస్ఈవోగా ఎందుకు నియమించడంలేదంటూ మండిపడింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా గవర్నర్ విశ్వభూషణ్ ను కలిసి వినతి పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆదేశించింది. ఇదిలా ఉంటే.. హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా తనను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈవోగా నియమించడంలేదంటూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Next Story






