- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి మండిపడింది. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడంలేదంటూ సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా కూడా నిమ్మగడ్డను ఎస్ఈవోగా ఎందుకు నియమించడంలేదంటూ మండిపడింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా గవర్నర్ విశ్వభూషణ్ ను కలిసి వినతి పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆదేశించింది. ఇదిలా ఉంటే.. హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా తనను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈవోగా నియమించడంలేదంటూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Next Story