మంగళగిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

by  |
మంగళగిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం
X

దిశ, అమరావతి బ్యూరో: మంగళగిరిలో పలు కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక బాప్టిస్ట్ పేటలో విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనకి వెళ్లిన ఆళ్ల రామకృష్ణ రెడ్డిని దళితులు అడ్డుకున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ తమ ప్రాంతంలో నిర్మించవద్దని శంకుస్థాపన ప్రాంతంలో నిరసనకు దిగారు. అయినప్పటికీ ఎమ్మెల్యే, అధికారులు శంకుస్థాపన చేశారు. దీంతో స్థానికులు కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed