ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

by  |
corona
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 64,739 సాంపుల్స్ పరీక్షించగా 1,520 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,18,200 కు చేరింది. అదే సమయంలో కరోనా బారిన పడి 10మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలుపుకుని మెుత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,887కు పెరిగింది. గత 24 గంటల్లో 1,290 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌‌కాగా..మెుత్తం ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,89,391కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో14,922 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,68,09,774 సాంపుల్స్ పరీక్షించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

Next Story