కరీంనగర్‌లో మరో 8 మంది పోలీసులకు కరోనా

by  |
కరీంనగర్‌లో మరో 8 మంది పోలీసులకు కరోనా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో పోలీసులుపై కరోనా పంజా విసిరింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వైరస్ బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బుధవారం 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాగా, మంగళవారం ఒక్క కరీంనగర్ వన్‌టౌన్‌లో 15 మందికి సోకింది. దీంతో కమిషనరేట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 103 మంది కరోనా బాధితులు ఉన్నారు.

Next Story

Most Viewed