ఏపీలో కరోనాతో 80 మంది మృతి

by  |
ఏపీలో కరోనాతో 80 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా 7,665 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. గడిచిన 24 గంటల్లో 80 మంది వైరస్ నుంచి కోలుకోలేక మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,116కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 87,773 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1,45,636 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 46,999 మంది అనుమానితులకు కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు 25 లక్షల 34 వేల 304 మందికి కోవిడ్ టెస్టులు చేశారు.

Next Story

Most Viewed