త్వరలో ఆరెంజ్ నుంచి గ్రీన్‌లోకి..

by  |
Collector
X

దిశ, నిజామాబాద్: జిల్లాకు చెందిన చివరి కరోనా రోగి గాంధీ ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 61 మందికి కరోనా నిర్ధారణ కాగా వారందరినీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించిన సంగతి తేలిసిందే. వారిలో నేడు చివరి పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్ కావటంతో కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వినియోగించాలన్నారు. జిల్లాలో అన్ని కంటైన్మెంట్ క్లస్టర్లను తొలగించామని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే నిజామాబాద్ జిల్లా త్వరలో ఆరంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి మారుతుందని జిల్లా కలెక్టర్ ఆశాభావం వ్యక్త పర్చారు..

Next Story

Most Viewed