కోయంబత్తూరు అడవుల్లో ఏనుగుల మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-10 06:27:07  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు అడవుల్లో ఏనుగుల మృతి కలకలం రేపుతోంది. గత ఆరునెల్లలో ఇప్పటివరకు 18 ఏనుగులు చనిపోయాయి. గత కొంత కాలంగా ఏనుగులు చనిపోతున్నాయని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా ఏనుగులు మృతిచెందడం పై జంతు ప్రేమికులు విచారం వ్యక్తంచేస్తున్నారు. వాటి సంక్షరణకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే వాటి దంతాల కోసం స్మగ్లర్లు ఏనుగులను చంపుతున్నారని.. [&hellip;]</p>

కోయంబత్తూరు అడవుల్లో ఏనుగుల మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు అడవుల్లో ఏనుగుల మృతి కలకలం రేపుతోంది. గత ఆరునెల్లలో ఇప్పటివరకు 18 ఏనుగులు చనిపోయాయి. గత కొంత కాలంగా ఏనుగులు చనిపోతున్నాయని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరుసగా ఏనుగులు మృతిచెందడం పై జంతు ప్రేమికులు విచారం వ్యక్తంచేస్తున్నారు. వాటి సంక్షరణకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే వాటి దంతాల కోసం స్మగ్లర్లు ఏనుగులను చంపుతున్నారని.. అయినా, ఫారెస్టు అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Next Story