విద్యుదాఘాతంతో లారీ క్లీనర్ మృతి

by  |
విద్యుదాఘాతంతో లారీ క్లీనర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుదాఘాతంతో లారీ క్లీనర్ మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మల్లెపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన అబ్బయ్య పత్తి కొనుగోలు నిమిత్తం సర్నేనిగూడెం గ్రామానికి లారీతో వచ్చాడు. రైతల వద్ద పత్తి కొనుగోలు చేసి, లారీ లోడ్ చేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


Next Story