నేటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

by  |
నేటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణ ప‌్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా నేటి నుంచి భూముల రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్లు మాత్ర‌మే ప్రారంభం కానున్నాయి. వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్ల‌కు మ‌రికొన్నిరోజుల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. హైద‌రాబాద్ ప‌రిధిలోని 20 మండ‌లాలు మిన‌హా రాష్ట్ర‌వ్యాప్తంగా 570 తహశీల్దార్ కార్యాలయాల్లో ధ‌ర‌ణి పోర్ట‌ల్ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. మీ-సేవా కేంద్రాల ద్వారా స్లాట్లు న‌మోదు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

Next Story

Most Viewed