జవాన్‌లే లక్ష్యంగా ఏవోబీలో ల్యాండ్ మైన్ పేల్చిన మావోలు

by  |
జవాన్‌లే లక్ష్యంగా ఏవోబీలో ల్యాండ్ మైన్ పేల్చిన మావోలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రా ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు ఆదివారం రెచ్చి పోయారు. భద్రతా బలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ గాయాల పాలయ్యారు. దీంతో అతన్ని సమీపంలోని రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. ఒడిశా మల్కాన్ గిరి జిల్లా దాల్ దాలీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story