రూ.30కోట్ల విలువైన ల్యాండ్ వివాదం !

by  |
రూ.30కోట్ల విలువైన ల్యాండ్ వివాదం !
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో భూ వివాదంపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్ నెంబర్ 12లో సుమారు 2వేల చదరపు గజాల స్థలం విషయంలో వేమిరెడ్డి నరసింహారెడ్డి, సుకుమార్‌రెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా న్యాయస్థానం స్టేటస్‌ కో విధించింది. ఇదేక్రమంలో సుకుమార్‌రెడ్డికి చెందిన మనుషులు బుధవారం ఆ స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు యత్నించడంతో వేమిరెడ్డి నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు ఉత్తర్వులను అతక్రమించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ల్యాండ్‌ విలువ రూ.30కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.


Next Story